CM Revanth Reddy: నిరుద్యోగులకు తీపికబురు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించనున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన జారీచేశారు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. సైనిక స్కూల్ వరంగల్ నుండి ఎందుకు పోయిందో.. బుల్లెట్ ట్రైన్ గురించి అడిగే వినోద్ రావు.. సైనిక స్కూల్ ఎందుకు తరలిపోయింది ఎందుకో చెప్పు? అని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అన్నారు. మేడిగడ్డ అన్నారం మీద విచారణ చేస్తున్నాం. ముందుంది ముసళ్ళ పండగ.. అన్నీ వసూలు చేస్తామన్నారు.
Also read: Rahul Gandhi: కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ
అధికారం పోయిన కేటీఆర్ లో విత్ డ్రాయల్ సిప్ట్సం కనిపిస్తున్నాయని.. మంచానికి కట్టేసే వైద్యం చేయించాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. టీఎస్పీఎస్ పై క్లారిటీ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఛైర్మన్ ఉండాలని.. కానీ అందరూ రాజీనామా చేశారని తెలిపారు. గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి అనుమతి కోరారని వెల్లడించారు.
నాలుగైదు రోజుల్లో గవర్నర్ నిర్ణయం ఇచ్చిన వెంటనే కమిటీ నియామకాలు జరుపుతామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ప్రజావాణికి ప్రత్యేక అధికారిని పెడతామన్నారు. బీఆర్ఎస్ వారు రైతు బంధు డిసెంబర్ 24 నుండి మార్చి నెలాఖరు వరకు ఇచ్చారని.. రైతు బంధు సీలింగ్ పై అసెంబ్లీలో చర్చ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. మేడిగడ్డలో ఎవరి పాత్ర ఎంత అనేది తేలుతుందన్నారు. ఖజానా అంతా ఊడ్చుకు పోయారని మండిపడ్డారు. అందుకే శ్వేతపత్రం ఇచ్చామన్నారు. కేసీఆర్ నిండా ముంచి.. వదిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడి నుండి నిధులు వస్తాయనేది చూస్తామన్నారు. కేంద్రం నుండి నిధులు ఆడిగామన్నారు. ఆటో డ్రైవర్ ల సమస్య ముందే గుర్తించామన్నారు. వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ని అమలు చేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.