Telangana: లోక్ సభ ఎన్నికల పై కాంగ్రెస్ దృష్టి… 17 స్థానాలకు ఇంఛార్జుల నియామకం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. రానున్న లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జులను ప్రకటించింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఆ పార్టీ ఇంఛార్జులను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
Also Read: 1000 ఎకరాలు గుర్తించండి… అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం
ఇంఛార్జులు వీరే
చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు – రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్, హైదరాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
నాగర్ కర్నూలు – జూపల్లి కృష్ణారావు
నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్ – కొండా సురేఖ
మహబూబాబాద్, ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అదిలాబాద్ – సీతక్క
పెద్దపల్లి – దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ – జీవన్ రెడ్డి
జహీరాబాద్ – పి.సుదర్శన్ రెడ్డి
మెదక్ – దామోదర రాజనర్సింహ
మల్కాజిగిరి- తుమ్మల నాగేశ్వర రావు.
Also Read: భారీ గుడ్ న్యూస్.. రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారా!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 న జరగాగ డిసెంబర్ 3 న ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రాగ బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాలసిన మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ తరుపున డిసెంబర్ 7 న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వివిధ శాఖలలో సీఎం సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ది పనులపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.