![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/07/cong.jpg)
T-Congress: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై కాంగ్రెస్ కసరత్తు.. ముహూర్తం ఖరారు?
తెలంగాణలో కొత్త పీసీసీ అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖారైరనట్టు సమాచారం. జూలై మొదటి వారంలో కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు అంశాలపై పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ ఇతర ముఖ్యనేతలతో అధిష్ఠానం ఇప్పటికే చర్చించి నిర్ణయానికి వచ్చింది. దీంతో పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి అదృష్టం దక్కనుందోనని ఎదురుచూస్తున్నారు.
Read Also: CM Revanth: రూ. 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూలై 2 లేదా 4న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉండటంతో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుని ప్రకటన ఉండవచ్చని అంటున్నారు. జూలై 2న ఏకాదశి మంచి ముహూర్తమే అయినప్పటికీ ఆ రోజు మంగళవారం. దీని కంటే జూలై 4న త్రయోదశి, గురువారం ఇంకా బాగుంటుందనే అభిప్రాయం వ్యకమైనట్టు సమాచారం. జూలై 6 నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుండటంతో ఆ లోగానే మంత్రివర్గ విస్తరణ జరగాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది.