తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెల నుంచే ఒంటిపూట బడులు

తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడులపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించ‌నున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూళ్లు ఏప్రిల్‌ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది.

Also read: HMDA: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్.. అక్రమంగా వేసిన కాలేజీ రోడ్డు తొలగింపు

ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే.. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు. వీరికి తొలుత మధ్యాహ్నం భోజనం అందజేసి ఆ తర్వాత తరగతులు కొనసాగిస్తారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button