తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana MLC: ప్రొఫెసర్ కోదండరామ్‌ను కీలక పదవి.. గవర్నర్ ఆమోదం

రేవంత్ సర్కార్ మరో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఈ మేరకు ఆయనతో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసింది.

ALSO READ: టీఎస్‌పీఎస్సీకి కొత్త చైర్మన్ వచ్చేశాడు.. ఎవరంటే?

ఉద్యమంలో ఎనలేని కృషి..

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరాం సేవలను తమ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటుందని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button