![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/పట్నం-22.jpg)
Vikarabad: పట్నం సునీతారెడ్డికి షాక్… అవిశ్వాస తీర్మానం పెట్టనున్న జెడ్పీటీసీలు
మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన రెండవ రోజే సునీతా రెడ్డిపై జెడ్పీటీసీలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. 12 మంది జెడ్పీటీసీలు కలెక్టర్ను కలిసి సునీతా రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈ అంశం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read: నాగబాబు పోటీపై కొరవడిన స్పష్టత… త్వరలోనే క్లారిటీ రానుందా?
కాగా, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతా రెడ్డి రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీని వీడి వీరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సునీతా రెడ్డికి కాంగ్రెస్ చేవేళ్ల ఎంపీ టికెట్ హామీ ఇవ్వడంతో వీరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరినట్లు సమాచారం.