తెలుగు
te తెలుగు en English
క్రికెట్

CWC 2023: పాక్ సెమీస్ కు వస్తే.. మ్యాచ్ జరిగేది అక్కడే

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమీస్ బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ సెమీస్ కు చేరితే టీమిండియాతోనే ఆడుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఒక సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడటం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ కు చేరితే టాప్ లో ఉన్న భారత్ తో తోనే ఆడాలి. అదే జరిగితే వరల్డ్ కప్ లో మ్యాచ్ వేదిక మారబోతుంది.

షెడ్యూల్ ప్రకారం ముంబైలో భారత్ తో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా, ముంబై నగరంలో పాకిస్థాన్ మ్యాచ్‌లు నిర్వహించకూడదని పీసీబీ.. బీసీసీఐకు అభ్యర్థన చేసింది. దీంతో పాకిస్తాన్ అభ్యర్ధనను గౌరవించిన ICC, BCCI పాక్ సెమీస్ కు వస్తే ముంబైలో సెమీస్ ఆడదని స్పష్టం చేసింది. పాక్, భారత్ తో కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అప్పుడు మరో సెమీ ఫైనల్ ముంబైలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.

నవంబర్ 15 న ముంబైలోని వాంఖడేలో మొదటి సెమీ ఫైనల్.. నవంబర్ 16 న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. టాప్ లో నిలిచిన జట్టు, నాలుగో స్థానంలో జట్టుపై మొదటి సెమీస్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అదే విధంగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిస్తే.. టాప్ లో ఉన్న భారత్ తో సెమీస్ ఆడేందుకు పాకిస్థాన్, న్యూజీలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button