తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Ind Vs Eng: భారీ స్కోర్ దిశగా భారత్.. మూడో టెస్ట్ మన చేతుల్లోకి!

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. అటు బౌలర్లతోపాటు బ్యాటర్లు సమష్టిగా రాణిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సరికి 320 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. ప్రస్తుతం 367 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రోజు కూడా మన బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం శుభమన్ గిల్(86 బ్యాటింగ్; 148 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో సెంచరీకి చేరువలో ఉన్నాడు. గిల్‌తోపాటు కుల్దీప్‌యాదవ్‌(26) నిలకడగా ఆడుతున్నాడు. కాగా, భారత్ రెండు వికెట్లకు 241 పరుగులు చేసింది.

ALSO READ: విశాఖలో మరో అంతర్జాతీయ క్రికెట్ మైదానం!

బౌలర్లు పట్టు బిగిస్తేనే..

భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ కంటే 367 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ మొదటి ఇన్నింగ్స్ లో మాదిరిగా మన బౌలర్లు ఇంగ్లండ్‌ బ్యాటర్లను కట్టడి చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది. అయితే అశ్విన్ లేకుండా బరిలోకి దిగడంతో మన బౌలర్లు ఏ మాత్రం రాణిస్తారన్నది చూడాల్సి ఉంది. కాగా, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడంతో భారత్ 450 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button