![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/376183-780x470.webp)
క్రికెట్
Ind vs Eng: భారత్తో మూడో టెస్ట్.. సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
భారత్, ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. ఇందులో భాగంగా మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత బౌలర్లు ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. జో రూట్ 18 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ దెబ్బకు బెయిర్ స్టో డకౌట్గా వెనుదిరిగాడు.
ALSO READ: అశ్విన్ ఖాతాల్లో 500 వికెట్లు.. భారత్ నుంచి రెండో బౌలర్గా రికార్డు
బెన్ డకెట్ ఔట్..
ఓపెనర్ బెన్ డకెట్ (151 బంతుల్లో 153; 23 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుభమన్ గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ కీలక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 54 ఓవర్లలో ఐదు వికెట్లకు 268 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.