![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/11/Indian-Cricket-Team-participated-in-Diwali-780x470.jpg)
Diwali: భారత క్రికెటర్ల సందడి.. రోహిత్, కోహ్లీ మధ్య నవ్వులపువ్వులు
వరుస విజయాలతో ప్రపంచకప్ (World Cup) పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు (Indian Cricket Team) సంబరాల్లో మునిగితేలింది. దీపావళి (Diwali) పర్వదినం సందర్భంగా బెంగళూరులోని (Bengaluru) ఓ హోటల్ లో దీపావళి వేడుకలో పాల్గొన్నారు. భారత జట్టు సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు. అనంతరం బాణసంచా కలిసి సందడి చేశారు.
చదవండి: రికార్డు సృష్టించిన ప్రపంచకప్.. ఎంతమంది చూశారంటే..
భారత జట్టు సారథి రోహిత్ శర్మ (Rohit Sharma), రాహుల్ ద్రవిడ్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), శుభ్ మన్ గిల్, రవీంద్ర జడేజా, షమీ, భువనేశ్వర్, బు్మ్రా, అశ్విన్, శ్రేయస్ అయ్యర్ తదితరులు కుటుంబసభ్యులతో వేడుకలకు హాజరయ్యారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కనిపించారు. అనంతరం ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు (Wishes) చెప్పుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. కాగా, ఓటమి లేకుండా వరుసగా 8 మ్యాచ్ లు గెలిచిన భారత జట్టు ఆదివారం నెదర్లాండ్స్ (Netherlands)తో తలపడింది. సెమీ ఫైనల్ (Semi Final)లో న్యూజిల్యాండ్ (Newzeland)తో తాడోపేడో తేల్చుకోనుంది.