తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL-2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులోకి కీలక ఆటగాడు

ఐపీఎల్‌ 2024 సీజన్‌ 17వ మినీ వేలం జరుగుతోంది. తొలిసారిగా భారత్‌ వెలుపల ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు. మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో మధ్యాహ్నం 1గంటలకు ప్రారంభమైంది. ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు ఉండగా.. 214 మంది భారత క్రికెటర్లు,119 మంది విదేశీయుల్లో ఇద్దరు అసోసియేట్‌ దేశాల నుంచి ఉన్నారు. 10 ప్రాంఛైజీలు కలిపి 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ALSO READ: ఐపీఎల్‌‌లో కొత్త రూల్.. ఇక హిట్టర్లకు కష్టమే!

వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ..

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో ఆటగాళ్ల కోసం జట్లు పోటీ పడుతున్నాయి. తాజాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక ఆటగాడిని తీసుకుంది. వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్ ఓటమికి కారణమైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్‌ ట్రావిస్ హెడ్‌ను దక్కించుకుంది. మొదట చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రయత్నించిన చివరికి రూ.6.80 కోట్లకు హైదరాబాద్ కైవసం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button