తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Team India: దక్షిణాఫ్రికాకు 163 పరుగుల ఆధిక్యం… 408 రన్స్ కి ఆలౌట్

సెంచురియన్ లో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. డీన్ ఎల్గార్ (185) భారీ సెంచరీ, మార్కో యన్సెన్ (84 నాటౌట్), డేవిడ్ బెడింగ్ హామ్ (56) అర్ధసెంచరీల సాయంతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 408 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు.

Also Read: ఫస్ట్ వ‌న్డేలో దంచి కొట్టిన హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన.. టార్గెట్ ఎంతంటే?

కాగా, సఫారీలకు కీలకమైన 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, మహ్మద్ సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. రెండు రోజులు ఆట మిగిలున్న నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button