తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Under 19 World Cup 2024: విజృంభించిన భారత బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచకప్‌లో యువ భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న తొలి సెమీస్‌లో భారత్ మొదట టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇందులో భారత బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (76, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిచర్డ్‌ సెలెట్స్వేన్‌ (64, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో లింబాని మూడు వికెట్లు, ముషీర్‌ ఖాన్‌ రెండు వికెట్లు, స్పిన్నర్‌ సౌమి పాండే ఒక వికెట్ తీశాడు.

ALSO READ: జింబాబ్వే టూర్ కు భారత్.. మ్యాచ్ షెడ్యూల్ ఖరారు

ఆదుకున్న ప్రిటోరియస్‌, రిచర్డ్‌లు

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఐదో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌ స్టీవ్‌ స్టాక్‌ (14)ను రాజ్‌ లింబాని ఔట్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్‌ టీగర్‌ డకౌట్ అయ్యాడు. 46 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ప్రిటోరియస్‌, రిచర్డ్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 72 పరుగులు చేశారు. ముషీర్‌ ఖాన్‌ వేసిన 30వ ఓవర్లో ప్రిటోరియస్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఒలీవర్‌ వైట్‌హెడ్‌ (22), జువాన్‌ జేమ్స్‌ (24), ట్రిస్టన్‌ లుస్‌ (23 నాటౌట్‌) రాణించడంతో 244లకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button