![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/355185-asaduddin-owaisi-780x470.jpg)
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు… రామమందిరం ప్రస్తావన
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసేసుకునే అవకాశం ఉందన్నారు. ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సారథ్యంలోని కేంద్రం చర్యలపై ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని అసదుద్దీన్ సూచించారు. అయోధ్య రామమందిర ప్రస్తావన కూడా తెచ్చిన ఆయన.. 500 ఏళ్ల పాటు ఖురాన్ పఠనం జరిగిన ప్రాంతం తమది కాకుండా పోయిందన్నారు.
Also Read: మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్చలు… సఫలం కానున్నాయా?
మూడు నాలుగు మసీదుల విషయంలో జరుగుతున్న కుట్ర కనిపించట్లేదా? ఢిల్లీలోని సునెహ్రీ మసీదు కూడా ఈ జాబితాలో ఉందని తెలిపారు. కొన్నేళ్ల పాటు కష్టపడి తాము ఈ స్థాయికి చేరుకున్నామని… ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలని అసదుద్దీన్ సూచించారు. ముస్లింలు అందరూ ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. మరి కొన్ని రోజుల్లో అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read: నుమాయిష్ ప్రారంభం.. ఎగ్జిబిషన్ వివరాలు తెలుసుకోండి
మసీదులు తమ నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మసీదులను ఎలా కాపాడాలో నేటి యువత జాగ్రత్తగా ఆలోచిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మదర్సాలను కాపాడాలని ఒవైసీ కూడా విజ్ఞప్తి చేశారు. ప్రమాదం ఏ విధంగా వస్తుందో చెప్పలేం.. అందరూ చనిపోతారు కానీ మరణానంతరం ఏం సమాధానం చెబుతారు? అంటూ ముస్లిం యువతను ఉసిగొల్పుతూ.. మరణానంతరం అల్లాకు ఏ ముఖం చూపిస్తారో గుర్తుంచుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.