![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/challan.jpg)
Telangana Government: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు
తెలంగాణలోని వాహనదారులకు మరోసారి ఊరట లభించింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజాగా ఫిబ్రవరి 15 వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Also read: South Central Railway: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు
పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 2023 డిసెంబర్ 27న ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. టూవీలర్స్, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం డిస్కౌంట్ తో చలాన్లు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. జనవరి 10 వరకు ఈ ఆఫర్ ను ఇచ్చింది. తర్వాత మళ్లీ జనవరి 31 వరకు గడువు పొడిగించింది. ఇవాళ్టితో గడువు ముగియడంతో మరోసారి పొడిగించింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటి వరకు 40 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 135 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని సమాచారం.