![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/KUTAMI-1.jpg)
Alliance: కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు?
అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లతో అఖండ మెజారిటీని సాధించిన టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదువులు దక్కుతాయి? మూడు పార్టీలు ఉన్న కూటమిలో తెలుగుదేశానికి ఎన్ని, జనసేన, బీజేపీలకు ఎన్ని పదవులు దక్కుతాయన్న చర్చ జరుగుతోంది. ఏకంగా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండటం, అందునా మూడు పార్టీలూ మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కోరుకోనున్న నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్లో స్థానం ఎవరికి అనేది ఆసక్తిదాయంగా మారుతోంది.
ALSO READ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎన్డీయేను డిమాండ్ చేస్తారా?
కూటమిలో నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీదే మెజారిటీ వాటా. మంత్రి వర్గంలో కూడా మెజారిటీ బెర్తులు ఆ పార్టీకే దక్కుతాయి. అయితే తాను పోటీ చేసిన 21 స్థానాల్లోనూ నెగ్గిన జనసేన కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యాన్నికోరుకుంటుంది. టీడీపీ గెలుపులో కీలకంగా మారిన స్వయంగా పవన్ కళ్యాణే మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ను డిప్యూటీ సీఎం చేసి, హోం మంత్రి బాధ్యతలు కూడా ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ కూడా కనీసం ఒకటో రెండో మంత్రి పదవులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి జనసేనకు మూడు, బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.