![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/janhvi.jpg)
Janhvi Kapoor: శ్రీవారి సేవలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. చీరకట్టులో ఆకట్టుకున్న జాన్వీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Also read: Boys Hostel: ఓటిటిలోకి వచ్చేస్తున్న బాయ్స్ హాస్టల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. రంగనాయకుల మండపంలో.. వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం అంద చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన జాన్వీ కపూర్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. జాన్వీ కపూర్ వెంట చిన్ననాటి స్నేహితుడైన శిఖర పహారియాతో పాటు అలనాటి హీరోయిన్ మహేశ్వరి కూడా ఉంది.
ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం కొరకు రావడంతో.. ఈ జంట త్వరలో ఏడు అడుగులు వేయడానికి సిద్దపడ్డట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. తరచూ తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుంటూనే ఉంటారు. ఆమెకు తిరుపతి బాలాజీ అంటే ఎంతో ఇష్టం. అంతే కాదు ఇప్పటికీ చాలామార్లు జాన్వీ తిరుమల దర్శనానికి వచ్చారు. ప్రస్తుతం జాన్వీ తిరుమల వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .