తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Heeramandi: సంజయ్‌ లీలా భన్సాలీ ‘హీరామండి’ ట్రైల‌ర్ రిలీజ్..ఎలా ఉందంటే?

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘హీరామండి’. దీనికి ది డైమండ్ బజార్ అనేది ట్యాగ్ లైన్. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో వ‌స్తున్న ఈ సిరీస్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ను భన్సాలీతో పాటు విభు పూరి, మితాక్షర కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా, మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ALSO READ: హాలీవుడ్ మూవీ ‘జోక‌ర్’ టీజ‌ర్ రిలీజ్

స్వాతంత్య్రం ముందు పాకిస్తాన్ లాహోర్‌లోని హీరామండి అనే ప్రాంతంలో వేశ్యలు ఉండ‌గా.. ఈ ప్రాంతాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాలా) పరిపాలిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతాన్ని త‌మ గుప్ప‌ట్లోకి తెచ్చుకోవాల‌ని బ్రిటీష్ వాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే మల్లికాజాన్ ఏం చేసింది. అన్నింటిని ఎదుర్కొని హీరామండిలో చివ‌ర‌కు ఎవరు రాజ్యమేలుతారు? అనే స్టోరీతో ఈ వెబ్ సిరీస్ వ‌స్తుంది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ మే 1 నుంచి అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button