Ramayan: ‘రామాయణం’ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు!
రణ్బీర్కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామాయణం’. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభిమైంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ALSO READ: శ్రీదేవి బయోపిక్పై బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు
‘రామాయణం’ తెలుగు వెర్షన్కు సంభాషణలు అందించే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు అందించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొద్ది మాటల్లో అనంతమైన భావాన్ని పొందికగా చెప్పగల చాతుర్యం త్రివిక్రమ్ సొంతం. రామాయణం లాంటి పౌరాణిక చిత్రానికి ఆయన అందించే సంభాషణలు సినిమా స్థాయిని మరింత పెంచుతాయని మేకర్స్ భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు. కానీ ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
One Comment