తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Inter Results: ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడెప్పుడా అని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ఫలితాలపై బిగ్ అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 15లోపు ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ నిన్నటితో ముగిసినట్లు తెలిపింది.

ALSO READ: వలంటీర్లపై ఎందుకింత పగ? బాబు ఎత్తుగడలను ఎదుర్కొనేందుకే రాజీనామాలు!

ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుండి 20 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10 లక్షల మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ పరీక్షలకు సంబంధించి, జవాబు పత్రాల మూల్యంకన ఇప్పటికే పూర్తైన నేపథ్యంలో ప్రస్తుతం ప్రశ్నా పత్రాల పునఃపరిశీలన, ఆన్లైన్‌లో మార్కులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపింది. ఏపీలో సార్వత్రిక, లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున అధికారులు త్వరితగతిన ఫలితాలను విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button