తెలుగు
te తెలుగు en English
క్రికెట్

KKR vs DC: చెలరేగిన నైట్ రైడర్స్.. ఢిల్లీపై భారీ గెలుపు

విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌ ఐపీఎల్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌(277) తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదైంది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో సునీల్‌ నరైన్‌ 85, రఘువంశీ 54, రస్సెల్ 41 పరుగులతో చెలరేగడంతో కోల్‌కతా భారీ స్కోరు నమోదు చేసింది.

ALSO READ: అదరగొట్టిన మ‌యాంక్ .. కెమ‌రూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్‌.. వీడియో వైరల్

273 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పృథ్వీ షా (10), మార్ష్(0), పొరేల్‌ (0), వార్నర్‌ (18) వెనుదిరిగారు. తర్వాత రిషబ్‌ పంత్(55) రాణించిన ఫలితం రాలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్‌ అరోరాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రస్సెల్‌లు చెరో వికెట్‌ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button