తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Revanth Reddy: టార్గెట్ మెదక్… కీలక నేతలతో సీఎం రేవంత్ సమావేశం

ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం తమకు ఎంతో ప్రతిష్ఠాత్మకమని… ఈ స్థానంలో పార్టీని గెలిపించి పూర్వవైభవం తీసుకువద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మెదక్ పార్లమెంట్ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: బీజేపీలో చేరిన బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో మన పథకాలే ప్రచారాస్త్రాలుగా విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని రేవంత్ సూచించారు. ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్‌కు ఓటేసేలా చూడాలన్నారు.

2 Comments

  1. I genuinely admired what you’ve accomplished here. The outline is elegant, your written content fashionable, however, you seem to have acquired some unease about what you wish to present going forward. Undoubtedly, I’ll revisit more often, similar to I have nearly all the time, in case you sustain this ascent.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button