తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CM YS Jagan: ఇష్టానుసారంగా హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయి? ఇంటర్వ్యూలో సీఎం జగన్ సంచలన విషయాలు

రాష్ట్ర ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదని, ఇష్టానుసారంగా హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రశ్నించారు. తాజాగా, టీవీ9 ఇంటర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. రాష్ట్రం అభివృద్ధి చేయడంతోపాటు ప్రజల జీవన స్థితిగతులు మార్చడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఏం చేసేందుకు అవకాశం ఉందో వాటినే మేనిఫెస్టోలో పెట్టాలని, సూపర్‌-6, సూపర్‌ -7 అంటూ అడ్డగోలు హామీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలుకాని హామీలతో 14 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని సీఎం జగన్‌ అన్నారు. కానీ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన హామీల్లో 99శాతం అమలు చేశామన్నారు. అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తున్నానని, నాకు ప్రైవేట్‌ లైఫ్‌ అంటూ ప్రత్యేకంగా లేదన్నారు. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్‌ అంతా ఒక్కటే.. దేవుడిపై నమ్మకం, ప్రజలపై విశ్వాసం ఉందని జగన్ స్పష్టం చేశారు.

ALSO READ: ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదు: పోసాని మురళి

సమస్యలు దగ్గరుండి చూశా..

పాదయాత్రలో ప్రజల సమస్యలను చూశానని, అందుకే రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని చేశామని జగన్‌ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు, నాలుగు సి పోర్టులు,10 ఫిషింగ్‌ హార్బర్లు, మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2019 తర్వాత 2 లక్షల 31 వేల ఉద్యోగాలు సృష్టించామని, ఎంఎస్‌ఎంఈల్లో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. గతంలో కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా.. 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్‌ పాత్ర ఉందన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చడానికి రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకర కాకుండా తాను అడ్డుకోవడంతో ఆగిందని సీఎం జగన్ గుర్తు చేశారు.

ALSO READ: పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే రాష్ట్రానికే ప్రమాదం: రాజేశ్ మహాసేన

బాబుకు లోకమంతా పచ్చగానే..

ఇంటి వద్దకే పెన్షన్‌, ఇంటి వద్దకే రేషన్..14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అంటూ సీఎం జగన్‌ ప్రశ్నించారు. ముఖ్యంగా రైతుల భూములకు సంబంధించి హక్కులు వారికే కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌పై చంద్రబాబు వివాదం సృష్టిస్తున్నారని, ల్యాండ్‌ టైటిలింగ్‌ అంటే ప్రజల భూములపై వారికి హక్కులు కల్పించడమేనన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నా పచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపించినట్లు ఉంటుందని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్‌కు రాలేదని, బీజేపీ విషయంలో తనకు సాఫ్ట్‌ కార్నర్‌ ఏమి లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ALSO READ:  ఏపీకి రాజధానిని లేకుండా చేసిన ‘పాపం’ చంద్రబాబుది కాదా?

ప్రజలకు తెలుసు..

కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. ఎన్నికలయ్యాక షర్మిల స్టాండ్‌ ఏంటో తెలుస్తుందని జగన్ వెల్లడించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డి చెబుతున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారని జగన్ తెలిపారు. ముఖ్యంగా . కడప ప్రజలకు అవినాష్‌ రెడ్డి ఎలాంటి వాడో తెలుసని అన్నారు. ఈ హత్య కేసును ఒక రాజకీయ అంశంగా మార్చి, రాజకీయంగా ఒక వ్యాక్యూమ్ సృష్టించే ప్రయత్నం చేశారని జగన్‌ అన్నారు. ఈ కేసును తప్పుదారి పట్టిస్తూ వాళ్లే కోర్టును ఆశ్రయించారని వివరించారు. ఈ ఎన్నికను కడప సెంట్రిక్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇక సునీత చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపదని జగన్‌ విస్పష్టంగా చెప్పారు.

ALSO READ: ఏపీని సంక్షోభంలోకి నెట్టేందుకు చంద్రబాబు భారీ స్కెచ్!

విశాఖ నుంచే పాలన

ఎన్నికలు పూర్తయిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్‌ అన్నారు. ఇక నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగుతున్నారు. రాష్ట్రంలో విశాఖ అతిపెద్ద సిటీ అని, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవన్నారు. అయితే హైదరాబాద్‌ లాంటి నగరం రాష్ట్రంలో లేకపోవడం దురదృష్టమని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనులతో వచ్చే పదేళ్లలో విశాఖ నగరం హైదరాబాద్‌, బెంగళూరుతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒక మోసపూరిత మనిషి.. చంద్రబాబు కారణంగా రాష్ట్రం నష్టపోయిందని, కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిందన్నారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే వైసీపీ ఎజెండా అన్నారు.

2 Comments

  1. I thought you did a great job here. The language is excellent and the picture is tasteful, but you come across as nervous about what you might say next. If you preserve this walk, I have no doubt that I will return more often.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button