తెలుగు
te తెలుగు en English
జాతీయం

Maharashtra: ఎట్టకేలకు కొలక్కి వచ్చిన ‘మహా’కూటమి సీట్ల పంపకం!

మహారాష్ట్రలోని ‘మహా’ కూటమి (శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీల మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకం పూర్తయింది. మొత్తానికి 21-17-10 ఫార్ములాను ఫైనల్‌ చేసినట్లు ఆ కూటమి నేతలు ఉమ్మడిగా ప్రకటించారు. ఉద్ధవ్‌ థాక్రే వర్గం శివసేన అత్యధికంగా 21 స్థానాల్లో బరిలో దిగుతుండగా, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ 17 స్థానాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ పడనున్నాయి.

ALSO READ: ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్.. కీలక నేత రాజీనామా

కాగా.. సీట్ల పంపకాల విషయంలో మూడు పార్టీల మధ్య ముందు నుంచి ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ సాంగ్లీ లోక్‌సభ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. సాంగ్లీలో మాకు పట్టుందంటే, మాకు పట్టుందని కాంగ్రెస్, శివసేనల మధ్య పోటీ నెలకొంది. అయితే, ఎట్టకేలకు కాంగ్రెస్‌ ఓ మెట్టు దిగడంతో సాంగ్లీ నుంచి శివసేన పోటీ చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ స్థానం నుంచి శివసేన తరుఫున రెజ్లర్‌ చంద్రహార్ పాటిల్‌ పోటీకి దిగుతున్నారు. అయితే అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడి నుంచి విశాల్‌ పాటిల్‌ను ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

One Comment

  1. Thank you for your response! I’m grateful for your willingness to engage in discussions. If there’s anything specific you’d like to explore or if you have any questions, please feel free to share them. Whether it’s about emerging trends in technology, recent breakthroughs in science, intriguing literary analyses, or any other topic, I’m here to assist you. Just let me know how I can be of help, and I’ll do my best to provide valuable insights and information!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button