IPL-2024: ఐపీఎల్లో నేడు తలపడనున్న గుజరాత్ వర్సెస్ పంజాబ్
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7: 30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక గతేడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లోనూ జోరు మీద ఉండగా.. ఇప్పటికే ఆడిన 3 మ్యాచుల్లో రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన తొలి మ్యాచ్లో విక్టరీతో సీజన్ను ప్రారంభించగా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ట్రాక్ మీదకు రావాలని చూస్తోంది.
ALSO READ: KKR vs DC: చెలరేగిన నైట్ రైడర్స్.. ఢిల్లీపై భారీ గెలుపు
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల బలాబలాలను చూస్తే గుజరాత్ మంచి ఫామ్లో కనిపిస్తుంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు మొత్తం 3 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాయి. ఇందులో పంజాబ్ పై రెండు మ్యాచ్లు గుజరాత్ గెలవగా.. పంజాబ్ ఒక్క మ్యాచ్ను కైవసం చేసుకోవడంతో పంజాబ్పై గుజరాత్ పైచేయి సాధించింది. అలాగే ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ అత్యధిక స్కోరు 190 చేయగా గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ అత్యధిక స్కోరు 189 చేసింది.