David Miller: గుజురాత్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ.. జట్టుకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కష్టాలు ఎక్కువవుతున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబై గూటికి చేరితే.. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి తప్పుకున్నాడు. తాజాగా ఆ జట్టు మ్యాచ్ విన్నర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయం గుజరాత్ ను కలవరపెడుతుంది. గురువారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా మిల్లర్ స్థానంలో విలియంసన్ కు ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు.
పంజాబ్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ కు గాయం కారణంగా మిల్లర్ ఆడటం లేదని చెప్పాడు. అయితే అతని గాయం తీవ్రత గురించి చెప్పలేదు. ప్రస్తుతం ఈ సఫారీ ఆటగాడి గాయం తీవ్రంగా ఉందని.. అతనికి ఒకటి లేదా రెండు మ్యాచ్ లు రెస్ట్ అవసరమని మ్యాచ్ తర్వాత విలియంసన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. కొన్ని సీజన్ లుగా నిలకడగా రాణిస్తున్న మిల్లర్ లేకపోవడంతో గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురు దెబ్బ తగలనుంది.
Also read: TSRTC: ఉప్పల్ వేదికగా హైదరాబాద్- చెన్నై మ్యాచ్.. మ్యాచ్ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు
మిల్లర్ లేకపోవడంతో ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.
One Comment