తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM YS Jagan: ఇవాళ ప్రచార సభలకు విరామం.. గెలిచే స్థానాలపై సీఎం జగన్ సమీక్ష

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ నిర్వహించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేమేంతా సిద్ధం బస్సు యాత్రతో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్.. అంతకుముందు సిద్ధం పేరుతోనూ భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. తాజాగా, మలివిడతలో భాగంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభించారు. ప్రతిరోజు మూడు ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటున్నారు.

ALSO READ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే బాబుకు తెలుసా? సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారానికి విరామం

ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ఇవాళ విరామం ప్రకటించారు. పార్టీ అంతర్గత సమావేశాల నేపథ్యంలో ఇవాళ ప్రచారానికి వెళ్లడం లేదని సీఎం జగన్ వెల్లడించారు. కాగా, ఎన్నికలకు 11 రోజుల సమయం కూడా లేకపోవడంతో గెలిచే స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా తాడేపల్లి నివాసంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. గెలిచే చోట కచ్చితంగా ఫోకస్ పెట్టాలని, వాటిని కైవసం చేసుకునేలా వ్యూహరచనలు చేయాలని దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై సమీక్ష నిర్వహించనున్నారు. అందుకే ఇవాళ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా, రేపటి నుంచి యథావిధిగా సీఎం ఎన్నికల ప్రచారం ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button