తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: మరో సంచలన సర్వే.. వైసీపీకి ఎన్ని సీట్లంటే?

దేశంలో పార్లమెంట్ ఎన్నికల వేళ.. పలు సర్వేలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ సాధిస్తుందనే అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించి ఫలితాలను బయటకు చెబుతున్నాయి. తాజాగాప్రముఖ జాతీయ మీడియా ఇంగ్లీష్‌ న్యూస్‌ ఛానల్‌ టైమ్స్‌ నౌ–ఈటీజీ సర్వే విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని సర్వేలో వెల్లడైంది. ఈ సంస్థ దాదాపు నెలరోజుల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ సర్వే చేసినట్లు టైమ్స్‌ నౌ ఛానల్‌ వెల్లడించింది.

ALSO READ: నెల్లూరులో ముఖ్యనేతలతో భేటీ.. నేడు బస్సు యాత్రకు విరామం!

వైసీపీకి ఎదురులేదు..

రాష్ట్రంలో వైసీపీకి ఎదురులేదని మరోసారి రుజువైనట్లు తేలింది. ఈసారి ఎన్నికల్లో 21 నుంచి 22 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తోందని స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కూటమి 3 నుంచి 4 ఎంపీ స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. ఇక బీజేపీకి మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేల్చింది. సంక్షేమ పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. తద్వారా సీఎం జగన్‌కు ప్రజల నుంచి ఆదరణ భారీగా పెరిగిందని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని తెలిపింది.

ALSO READ: మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం చేస్తా.. సీఎం జగన్

ప్రజల్లో నుంచి భారీ రెస్పాన్స్

గత ఎన్నికలతో పోల్చితే వైసీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి కారణాలపై ప్రధానంగా చర్చ సాగింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం వాగ్దానాలను అమలు చేచడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. తాజాగా, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల్లో నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రతీ ఒక్కరూ జగన్‌కే జైజైలు కొడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మీ ఇంటికి మంచి చేశానని నమ్మితేనే ఓటేయాలంటూ సీఎం జగన్‌ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బలంగా వెళ్లడం వైసీపీకి కలిసొచ్చింది. కాగా, ప్రస్తుతం ఈ సంస్థ చేసి సర్వే అంచనాలపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button