తెలుగు
te తెలుగు en English
జాతీయం

Elections: బీజేపీలో చేరిన బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. ప్రముఖ భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు విజేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం పార్టీ అధిష్టానం ఈ యువ బాక్సర్‌ను దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు.

Also Read:  కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

అయితే ఈ సారి విజేందర్‌ను సింగ్‌ దక్షిణ ఢిల్లీ నుంచి కాకుండా ఉత్తర్‌ ప్రదేశ్ లోని మధుర లోక్‌సభ అభ్యర్ధిగా బరిలోకి దించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ బీజేపీలో చేరడంతో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోవైపు మధుర నుంచి బీజేపీ తరపున నటి హేమమాలని పోటీ చేస్తున్నారు. ఇప‍్పటికే ఆమె 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button