Bigg Boss: పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
బిగ్బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్కు సంబంధించిన కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. సరూర్ నగర్కు చెందిన అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడాకు చెందిన సుధాకర్, పవన్లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా, ఈ వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని నిందితులుగా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ALSO READ: భక్తులతో యాదాద్రి కిటకిట.. దర్శనానికి 4గంటల సమయం
బెయిల్ కోసం 12మంది దరఖాస్తు
బిగ్బాస్ ఫైనల్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి ఘటనలో ప్రశాంత్తోపాటు అతని సోదరుడు మహావీర్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో బిగ్బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ ఠాణాకు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం కేసులో 12 మంది నిందితులు సైతం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.