తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Guntur Kaaram: ప్ర‌మోష‌న్స్ షురూ.. ‘సంక్రాంతి మొగుడొస్తున్నాడు’!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, స్టార్ డైరెక్ట‌ర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే వేరే లెవల్ క్రేజ్. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హ్యాట‍్రిక్ సినిమా అనేసరికి ప్రేక్షకులు తెగ ఎగ్జైట్‌తో ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. భారీ అంచనాలున్నఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన దమ్‌ మసాలా బిర్యానీ, ఓ మై బేబీ పాటలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. మహేష్ బాబు లుంగీ క‌ట్టుకుని ఊర మాస్ లుక్‌లో ఉన్న ఫొటోలు విడుదల చేశారు. ఇందులో ‘సంక్రాంతి మొగుడు వచ్చేస్తున్నాడు.. ఈసారి పరిమితులు లేవు… ఊచకోత మాత్రమే’ అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ లుక్స్ సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది.

ALSO READ: ‘సలార్‌’ మాస్ యాక్ష‌న్ ప్రోమో రిలీజ్.. గూస్ బంప్స్!

రోజుకో అప్‌డేట్..

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఎస్‌ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం మూవీ ప్ర‌మోష‌న్స్ మొదలయ్యాయి. ఒకవైపు సినిమా షూటింగ్ చేస్తుండగానే.. మరోవైపు మేకర్స్ రోజుకో అప్‌డేట్ ఇస్తున్నారు. అయితే ఒకరోజు క్రితం టేబుల్ మీద మహేష్ బీడీ కాలుస్తూ ఉన్న ఫొటోతో పాటు లుంగీ క‌ట్టుకుని ఉన్న ఫొటోల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button