Jayaprada: ప్రముఖ నటి మిస్సింగ్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద కనిపించడం లేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం యూపీ పోలీసులు గాలిస్తున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు. దీంతో జడ్జీ ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు జనవరి 10న కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
ALSO READ: కుర్చీ తాతకు ‘గుంటూరు కారం’ టీమ్ భారీ రెమ్యునరేషన్
ప్రత్యేక బృందం
బీజేపీ నాయకురాలు జయప్రద మిస్సింగ్ కలకలం రేపుతోంది. దీంతో ఆమెను వెతికేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. 2019న జయప్రద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ యూపీలోని స్వర్ ప్రాంతంలో ఉన్న నూర్పూర్ గ్రామంలో రోడ్డును ప్రారంభించారు. దీంతో పాటు పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమె కొంతకాలంగా కనిపించకపోవడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.