Kota Bommali PS: ఓటీటీలోకి కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కొటబొమ్మాళి పీఎస్’ ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహించగా..నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్గా మంచి టాక్ వస్తోంది. తాజాగా ఈ సినిమాను ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాలో సంక్రాంతి కానుకగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ALSO READ: ఊపందుకున్న డెవిల్ కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎంతంటే?
ముగ్గురు పోలీసుల కథ
రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ ఈ కోట బొమ్మాళి పీఎస్… ఈ సంక్రాంతికి, మీ ఆహలో! అంటూ రాసుకొచ్చింది. గీతాఆర్ట్స్2 పతాకంపై బన్నీ వాసు, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించగా.. జగదీష్ చీకాటి కెమెరామెన్గా, రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ సంగీతం అందించారు. కథ విషయానికొస్తే.. రాజకీయ నాయకుల ఒత్తిడుల కారణంగా చేయని తప్పుతో ఓ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఎలాంటి శిక్షను అనుభవించారు? చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లే ఆ చట్టం చేతిలో ఎలా బలైపోయారు? పోలీసులకు దొరక్కుండా ఎందుకు పారిపోవాల్సివచ్చిందన్నదే మూవీ కథ.