తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kotabommali: ఓటిటిలోకి వచ్చేస్తున్న కోటబొమ్మాళి పీఎస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. విడుదలకు ముందే ఈ సినిమాలోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేశారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్‏గా పబ్లిసిటీ వచ్చేసింది. తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ నాయాట్టు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also read: Samyuktha Menon: పెళ్లిపీటలెక్కబోతున్న సంయుక్త మీనన్.. సినిమాలకు ఇక గుడ్ బై?

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా న్యూఇయర్ వీకెండ్‏లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 5న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ తర్వలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారట.

ఒక రాజకీయ నాయకుడి కారణంగా ముగ్గురి పోలీసుల జీవితాలు తారుమారవుతాయి. ఆ తర్వాత ఓరోజు రాత్రి ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న కారు యాక్టిడెంట్ కావడం.. ఆ ప్రమాదంలో నియజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు. దీంతో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఈ ముగ్గురి పోలీసుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ?.. చట్టం చేతిలో వారి జీవితాలు ఏమయ్యాయి ?.. అనేది కోట బొమ్మాళి కథ. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మీ, శివాని, రాహుల్ విజయ్ తమ నటనతో ఆకట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button