Unstoppable: రణబీర్, రష్మికతో బాలయ్య రచ్చరచ్చ
బుల్లితెర టాక్ షోలో నంబర్ వన్-గా నిలిచిన అన్ స్టాపబుల్ మరో సీజన్ ప్రారంభమైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ షో ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ షోలో ‘యానిమల్’ చిత్ర బృందం సందడి చేసింది. బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), హీరోయిన్ రష్మిక మందాన్న (Rashmika Mandanna), దర్శకుడు సందీప్ వంగా (Sandeep Vanga) హాజరయ్యారు. వారితో కలిసి బాలయ్య పంచ్ లు, డైలాగులతో సందడి చేశారు. దీనికి సంబంధించి ప్రొమోను ఆహా (Aha) విడుదల చేసింది.
Also Read ఎన్నికల వేళ ప్రచారంలోకి దూకిన హీరో నాని
పలు దర్శకుల విషయమై బాలకృష్ణ ప్రశ్నలు వేయగా.. అవి తనను ఇరుకునపెట్టే ప్రశ్నలుగా భావించి సందీప్ సమాధానాలు (Answers) చెప్పలేక తడబడ్డాడు. అనంతరం రణ్ బీర్ రాగా.. అతడితో బాలయ్య ‘ఫ్లూటు జింక ముందు ఊదు’ అనే డైలాగ్ చెప్పించాడు. ఆ తర్వాత రష్మిక రాగా ఆమెతో బాలయ్య డ్యాన్స్ (Dance) చేసి వావ్ అనిపించాడు.
ఈ సందర్భంగా రష్మికతో ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) ఫోన్ చేయించాడు. రష్మిక, విజయ్ మధ్య ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా ఉంది. అనంతరం రణ్ బీర్, రష్మికతో కలిసి బాలయ్య తన ఫేవరెట్ ‘పైసా వసూల్’ స్టెప్పులు వేయించాడు. ఈ ఎపిసోడ్ (Episode) నవంబర్ 24న ఆహాలో మాత్రమే ప్రసారం కానుంది.
Also Read యూట్యూబ్లో దూసుకెళ్తున్న ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్
రణ్ బీర్, రష్మిక హీరోహీరోయిన్లుగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal Movie) చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా (Pan India) స్థాయిలో తీసిన ఈ సినిమా ఐదు భాషాల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.