తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Lokesh: చంద్రబాబు సూపర్ 6 పథకాలు… త్వరలో రిలీజ్

సీఎం జగన్ మోహన్‌రెడ్డి పచ్చి అబద్దాల కోరని శృంగవరపుకోట శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు నెలల్లో జగన్‌తో రాష్ట్ర ప్రజలు ఫుట్ బాల్ ఆడుకోబోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సింహాసనంపై శునకం కూర్చుంది. ప్రజల కన్నీళ్లు చూసిన చంద్రబాబు సూపర్ 6 పథకాలు పెట్టబోతున్నారని తెలిపారు.

Also Read: కులగణన… బీసీలను మభ్యపెట్టే చర్య: ఎమ్మెల్సీ కవిత

వైసీపీకి అభ్యర్ధులు దొరకటం లేదన్నారు. అభివృద్ధి కోట శృంగవరపుకోటని అవినీతి కోటగా ఎమ్మెల్యే కడుబండి మార్చేశారని ఆరోపించారు. కరోనా సమయంలో స్ధానిక పరిశ్రమల యాజమాన్యాలు నుంచి ఎమ్మెల్యే కడుబండి భారీగా కలెక్షన్లు చేశారన్నారు. అవినీతి సామ్రాట్ జగన్‌కు తానేమీ తక్కువ కాదన్న రీతిలో ఎమ్మెల్యే కడుబండి అవినీతి డబ్బు యాభై కోట్లతో ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button