![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/revanth-2.jpeg)
Delhi: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ… పలు కీలక అంశాలపై చర్చ
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం… టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్
తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణం, ప్రాంతీయ రింగ్ రోడ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధి, సిర్పూర్-కాగజ్ నగర్ నేషనల్ హైవే, భువనగిరి రహదారి, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. మొత్తమ్మీద 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని కోరారు.
Also Read: వైసీపీలోకి ఆర్కే రీ ఎంట్రీ.. కారణం అదేనా!
అంతేకాదు, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్రం మంజూరు చేసిన కేబుల్ బ్రిడ్జిని మరో ప్రాంతానికి మార్చే అంశం కూడా నితిన్ గడ్కరీతో సమావేశంలో ప్రస్తావించారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్ మంజూరు చేయాలని, నల్గొండలో రవాణా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీని కోరినట్టు తెలిసింది.