Jharkhand Court: రాహుల్ కు చుక్కెదురు.. వ్యాజ్యం తోసిపుచ్చిన కోర్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. పరువు నష్టం కేసును కొట్టేయాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది. రాతపూర్వకంగా రాహుల్ అభ్యర్థించినా న్యాయస్థానం మాత్రం నిరాకరించింది.
Also read: Governor Tamilisai: మేడారం జాతరకు గవర్నర్ తమిళిసై.. వనదేవతలకు ప్రత్యేక పూజలు
అయితే 2018లో అమిత్ షాపై కించపరిచే వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువునష్టం దావాలో ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలని రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జార్ఖండ్ హైకోర్టులో బీజేపీ నేత నవీన్ ఝా పరువునష్టం దావా వేశారు. తాజాగా హైకోర్టు విచారణ చేపట్టి కాంగ్రెస్ నేత రాహుల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోనుందో చూడాల్సిందే.