KA Paul: కేంద్ర, రాష్ట్రాల అప్పులు నేను మాత్రమే తీర్చగలను.. కేఏ పాల్ వైరల్ కామెంట్స్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వైరల్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు. తెలుగు వారి సత్తా చూపించేందుకు, మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు ఆయనపై పోటీ చేస్తానని ప్రకటించారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు.
Also read: TMC MP: ఉపరాష్ట్రపతిని వెక్కిరించిన ఎంపీ.. నెటిజన్స్ ఫైర్
అంతేకాకుండా.. నేను తప్ప ఎవరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరని అన్నారు. వడ్డీలు కూడా కట్టలేదు.. ఇతర సాకులతో గడిపేస్తారని విమర్శించారు. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50 కోట్లు అడుగుతున్నారట. దేశంలో, రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని పేర్కొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ రూ 1000 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షా కోరగా.. తాను వెళ్లలేదని కేఏ పాల్ వెల్లడించారు.