తెలంగాణ
CM KCR: గెలుపుపై కేసీఆర్ ధీమా.. కీలక నిర్ణయం
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇక గురువారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తెలంగాణలో అధికార మార్పిడి కచ్చితంగా జరుగుతుందని సర్వేలన్నీ వెల్లడించాయి. ఇక దీనిపై ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ ముమ్మాటికి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సర్వే ఫలితాలను కొట్టిపారేశారు.
Also read: Beer Sales: తెలంగాణలో ఎన్నికలు.. ఫుల్ గా తాగేశారు
ఇక ఇందులో భాగంగానే ఈనెల 4న తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నామని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మ. 2 గంటలకు భేటీ జరగనుంది. అయితే ఈనెల 3న ఎన్నికల ఫలితాలు రానుండగా.. తరువాతి రోజే మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారని ఉత్కంఠ రేపుతోంది.