తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth: తెలంగాణలో రియల్ ఎస్టేట్…ఆదాయం పెంచే పనిలో సర్కార్

తెలంగాణలో ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్… రాష్ట్రంలో ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారడం ఖాయమని, దీంతో పాలసీలు అమలు చేయడం కష్టంగా మారుతుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 శాతం రియల్‌ ఎస్టేట్ పడిపోయిందని కేటీఆర్ చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపించడానికి, రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించడానికి కావలసిన ప్రణాళికలు రచిస్తుంది.

Also Read: రాష్ట్ర మహిళలు దేశంలోనే అగ్రస్థానం.. ఎలా అంటే?

ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు తగ్గకుండా..ఎక్కువ సంఖ్యలో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దాదాపు 7, 8 నెలల నుంచి రాష్ట్రంలో భూములు, స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. ఎన్నికలు రావడంతో చాలా వరకు అగ్రికల్చర్, నాన్​ అగ్రికల్చర్​ రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు తెలుస్తుంది.

Also Read: మంత్రి రజనీ కార్యాలయంపై దాడి.. గుంటూరులో ఉద్రిక్తత

కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రియల్టర్లు, బిల్డర్లతో పాటు జనాలకు.. ఎటువైపు డెవలప్ మెంట్​ జరిగే అవకాశం ఉందో? ప్రభుత్వ కార్యచరణ ఏంటే అనే దాని పై క్లారిటీ రాలేదు. వీటి కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. అయితే, ఇండస్ట్రీల విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక స్పష్టతను ఇచ్చింది. ఓఆర్​ఆర్​ అవతల… ఆర్​ఆర్​ఆర్​ లోపల పరిశ్రమల ఏర్పాటుకు తగిన భూములు గుర్తించాలని ఆదేశించింది. దీంతో ఆ ప్రాంతాల్లో కొంతమేర రియల్​ భూముల విలువలను​ పెంచేందుకు ప్లాన్​ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button