తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Governor Tamilisai: ఓటరు దినోత్సవంలో గవర్నర్ తమిళిసై.. కొందరు చస్తామని ఓట్లు అడిగారని సెటైర్లు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై గవర్నర్ తమిళి సై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారని ఎలక్షన్ కమిషన్ అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయొద్దని సూచించారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే మంచి అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు.

Also read: Congress: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహం.. నేడు రాష్ట్రానికి మల్లికార్జున ఖర్గే

ఓటు వేయడం మన హక్కు అని గవర్నర్ అన్నారు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు మధ్య వారధిగా ఉండటం తన బాధ్యత అని చెప్పారు. హోమ్ ఓటింగ్ లో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఓటింగ్ రోజు సెలవు సరదా కోసం కాదని యువత గుర్తించుకోవాలని సూచించారు. తాను నోటా ఓటుకు వ్యతిరేకమని చెప్పారు. ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని గవర్నర్ తమిళి సై కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button