Congress: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహం.. నేడు రాష్ట్రానికి మల్లికార్జున ఖర్గే
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. నేడు హైదరాబాద్ రానున్నారు. ఎల్బీస్టేడియంలో జరగబోయే బూత్ లెవల్ ఏజెంట్స్ సమావేశానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది.
Also read: Mamata Banerjee: ఇండియా కూటమికి షాక్.. ఒంటరి పోరుకు సిద్ధమైన మమతా
దాదాపు 40 వేల మంది పార్టీ కార్యకర్తలతో జరగబోయే ఈ సమావేశంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై… దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు ఖర్గే పలు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అధినేత ఖర్గే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.