![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/IAS_Officer-780x414.webp)
Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం… పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. దేవాదాయ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ ను నియమించారు.
Also Read: కరెంట్ కట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం… అధికారులకు సీఎం హెచ్చరిక
బదిలీ అయిన అధికారులు వీరే
- ఇరిగేషన్ స్పెషల్ సెక్రెటరీగా పాటిల్ ప్రశాంత్ జీవన్
- జనగామ జిల్లా నూతన కలెక్టర్గా షేక్ రిజ్వాన్ బాషా
- సిద్ధిపేట జిల్లా నూతన కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి
- దేవాదాయ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్
Also Read: Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్… విషయం ఇదేనా!
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో పది మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది. ఇందులో టీఎస్పీఎస్సీ సెక్రెటరీగా నవీన్ నికోలస్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా అనిత రామచంద్రన్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా హనుమంతరావు ఉన్నారు. అలాగే, బీసీ వెల్ఫేర్ కమీషనర్ గా బాలమాయదేవిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు హార్టీ కల్చరర్ డైరెక్టర్ గా అశోక్ రెడ్డి, ఫిషరీస్ కమీషనర్ గా బి. గోపి, స్త్రీ శిశుసంక్షేమ, ఎస్సీ వెల్ఫేర్ కమీషనర్ గా నిర్మల కాంతి వెస్లీ, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా సీతా లక్ష్మీ, ఛీఫ్ రేషనింగ్ గా ఫనీంధ్రను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది.