తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Elections Results: ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. రేపు వైన్స్ షాపులు బంద్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ డిసెంబర్ 3న జరగనుంది. ఈ మేరకు ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌దతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ALSO READ: మ్యాజిక్ ఫిగర్ కష్టమే.. బీజేపీకి హంగ్‌ ధీమా!

మూడంచెల భద్రత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 49 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, హైదరాబాద్ జిల్లాలో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో 15 కౌంటింగ్‌ కేంద్రాలుండగా.. ఇక్కడ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ఐదుగురు, అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గుమికూడదని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రాలకు కిలోమీటరు దూరంగా జెండాలు, కర్రలు, పేలుడు పదార్థాలు, గుమిగూడటం, సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశించారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మైకుల్లో ప్రచారం, సమావేశాలు, ఆటపాటలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా కూడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button