TS High Court: ఉచిత బస్సు ప్రయాణం… హైకోర్టులో విచారణ వాయిదా
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన జీవో 47ను రద్దు చేయాలని నాగోల్కు చెందిన హరీందర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తీవ్ర రద్దీ పెరిగిందని పిటిషన్ వాదించారు.
Also Read: రాహుల్ గాంధీ కారుపై దాడి… కాంగ్రెస్ నాయకులు సీరియస్
కుటుంబంతో వెళ్తే బస్సుల్లో నిలబడే పరిస్థితి కూడా లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉచిత ప్రయాణంపై ఇచ్చిన జీవో 47ని రద్దు చేయాలని హరీందర్ హైకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ తాను ఇబ్బంది ఎదుర్కొని పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఈ క్రమంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.