Job Notification: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో జాబ్ నోటిఫికేషన్
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ వరుస శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం దేవాదాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీలో ఖాళీగా ఉన్న 99 లెక్చరర్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు:
ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్-01, ఆటో మొబైల్ ఇంజనీరింగ్-08, బయో మెడికల్ ఇంజనీరింగ్-02, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్-12, సిరామిక్ టెక్నాలజీ-01, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-04, కెమిస్ట్రీ-08, సివిల్ ఇంజనీరింగ్-15, కంప్యూటర్ ఇంజనీరింగ్-08, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-02, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-01, ఇంగ్లీష్-04, గార్మెంట్ టెక్నాలజీ-01, జియాలజీ-01, మ్యాథమెటిక్స్-04, మెకానికల్ ఇంజనీరింగ్-06, మెటలర్జికల్ ఇంజనీరింగ్-01, మైనింగ్ ఇంజనీరింగ్-04, ఫార్మసీ-03, టెక్స్టైల్ టెక్నాలజీ-03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Also read: Telangana Government: వాహనదారులకు షాక్.. చలాన్లపై వారికి డిస్కౌంట్ లేదు
ఈ పోస్టులకు జనవరి 29 నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 18. ఎప్రిల్, మే నెలలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్లో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతోపాటు ఇంగ్లీష్ టైప్రైటింగ్ హయ్యర్గ్రేడ్, షార్ట్హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక అభ్యర్థుల వయస్సు 01 జులై 2023 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి రూ.98,400 చెల్లించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. నోటిఫికేషన్ పై మరిన్ని వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడవచ్చు.