తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Bomb Explosion: బెంగళూరులో బాంబు పేలుళ్ల కలకలం.. పలువురికి తీవ్రగాయాలు

బెంగళూరులోని రామేశ్వరం ప్రాంతంలో ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది కాగా, ఇద్దరు కస్టమర్లుగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.

Also read: BRS: బీఆర్ఎస్ నేతల ఛలో మేడిగడ్డ.. అయ్యో.. పేలిన బస్సు టైరు

భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా కస్టమర్లు భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. పేలుడు విషయం తెలుసుకున్న వైట్ ఫీల్డ్ ఏరియా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతమంతా తనిఖీలు చేపట్టారు. రామేశ్వరం కేఫ్ బెంగుళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ పాయింట్లలో ఒకటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button