![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/KTR.jpg)
KTR: వినూత్నంగా న్యూఇయర్ చేసుకున్న కేటీఆర్
కొత్త సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వినూత్నంగా చేసుకున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు.
Also Read Guntur: మంత్రి రజనీ కార్యాలయంపై దాడి.. గుంటూరులో ఉద్రిక్తత
కార్మికుల పక్కన కేటీఆర్ భోజనం చేస్తూ వారి యోగక్షేమాలు ఆరా తీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందని వాకబు చేశారు. ఈ సందర్భంగా ప్రతి కార్మికులను కలిసి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొందరు కేటీఆర్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఎక్స్’ వేదిక కేటీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read అభిమానులకు ఎన్టీఆర్ గుడ్ న్యూస్.. ‘దేవర‘ గ్లింప్స్ పై కీలక ప్రకటన