Judo: జూడో రాష్ట్రస్థాయి పోటీలు… ఈ నెల 5 నుంచి ప్రారంభం
సుల్తానాబాద్ పట్టణంలో ఈనెల 5న రాష్ట్ర స్థాయి జూడో పోటీలను ప్రారంభించబోతున్నామని జిల్లా జూడో సంఘం అధ్యక్షుడు మాటే సంజీవ్కుమార్ తెలిపారు. సుల్తానాబాద్లో స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రస్థాయి పోటీల వివరాలను వెల్లడించారు. స్థానిక ఐపీఎస్ స్కూల్లో ఈనెల ఐదు నుంచి రెండు రోజుల పాటు సబ్జూనియర విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తామని ఈ పోటీలలో పాల్గొ నేందుకు తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 300మంది క్రీడాకారులు, 50మంది కోచ్లు, మేనేజర్లు, రెఫరీలు పాల్గొంటారని అన్నారు. హాజరైన వారందరికీ భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు.
Also Read: తెలంగాణలో సాగుతున్న ఓట్ల లెక్కింపు.. మంత్రులు వెనుకంజ
బాలబాలికల విభాగాల్లో మొత్తం 18 వెయిట్ కేటగిరిలలో మొత్తం 72 పతకాలకు పోటీ జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులను ఈనెల 15 నుంచి 18 వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగే జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీలకు ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జూడో పోటీలకు కేంద్రంగా నిలుస్తుందన్నారు.